శ్రీకృష్ణుని దివ్య ఆగమనం అపారమైన ఆనందానికి ప్రతీక
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా
ఢిల్లీ: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అపారమైన ఆనందం, ఆధ్యాత్మిక ఉల్లాసంతో కూడిన పండుగ అని, శ్రీకృష్ణుని దివ్య ఆగమనానికి ప్రతీకగా నిలిచే ఈ పవిత్ర సందర్భాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారని ముఖ్యమంత్రి రేఖా గుప్తా తెలిపారు.
ఈ సందర్భంగా ప్రజలందరికీ ఆమె తన హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. "నేటి వేడుక శ్రీకృష్ణుని దివ్య జననాన్ని సూచించే అంతర్జాతీయ సందర్భం మాత్రమే కాక, ప్రజలందరిలోనూ ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపే గొప్ప వేడుక" అని సీఎం పేర్కొన్నారు.