BREAKING
ఆహార వైవిధ్యం, ప్రోటీన్ లభ్యతపై దృష్టితో 'రాష్ట్రీయ పోషణ్ మాహ్ 2026' ప్రారంభం యూపీఐ నుండి ప్రపంచ నాయకత్వం వరకు హరిత హైడ్రోజన్ ఉత్పత్తికి కొత్త దారి డీయూఎస్‌యూ ఎన్నికల నామినేషన్లు భారతదేశ భవిష్యత్తు నిర్మాణంలో గిరిజన సమాజాలు భాగస్వాములు ప్రైమ్ వీడియోలో ‘జగమే సంగీతం’: ఈ మ్యూజికల్ డ్రామాను చూడటానికి 5 బలమైన కారణాలు రాష్ట్ర ప్రథమ్ వికసిత్ భారత్ @ 2047 6G సాంకేతికత, భద్రతపై ప్రపంచ పిలుపునకు భారత్ ఆమోదం ఘనంగా 'కళ్యాణం కమనీయం జీవితం' ట్రైలర్ లాంచ్: ఈ నెల 18న గ్రాండ్ రిలీజ్ పగిలిన 'క్రూడ్' బాంబు ఎపిక్ ప్రీరిలీజ్ ఈవెంట్: ఆనంద్ దేవరకొండ సినిమాపై టాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు రూ. 10,783 కోట్లతో మరో 3 రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం ముఖ్యమంత్రి సమావేశ నిర్ణయాలపై పర్యవేక్షణ కట్టుదిట్టం తెలుగు రాష్ట్రాలకు కేబినెట్ తీపి కబురు అమెరికా, ఇరాన్ దాడులతో మళ్లీ తీవ్రమైన యుద్ధం

ముఖ్యమంత్రి సమావేశ నిర్ణయాలపై పర్యవేక్షణ కట్టుదిట్టం

Select Suryaa Now
ముఖ్యమంత్రి సమావేశ నిర్ణయాలపై పర్యవేక్షణ కట్టుదిట్టం

హర్యానా ప్రభుత్వం కీలక ఆదేశాలు
చండీగఢ్: ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్షా సమావేశాలలో తీసుకునే నిర్ణయాల అమలుపై హర్యానా ప్రభుత్వం పర్యవేక్షణను మరింత తీవ్రతరం చేసింది. నిర్ణయాల అమలులో జాప్యాన్ని నివారించేందుకు, బాధ్యతలను కచ్చితంగా నిర్ధారించేందుకు సరికొత్త ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని (SOP) మంగళవారం రాత్రి జారీ చేసినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనురాగ్ రస్తోగి వెల్లడించారు. ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వచ్చాయి.

కొత్త నిబంధనల ప్రకారం, శాఖలు సమర్పించే 'కార్యాచరణ నివేదికల' (ATR) లో ఇకపై "చర్యలు తీసుకుంటున్నాము" వంటి అస్పష్టమైన సమాధానాలు ఇవ్వడానికి వీల్లేదు. ప్రతి నిర్ణయంపై వాస్తవంగా ఏం జరిగిందో తెలుపుతూ ఉత్తర్వులు, పురోగతి వివరాలు లేదా ఛాయాచిత్రాల రూపంలో ఆధారాలను తప్పనిసరిగా జతచేయాలి. సమావేశం ముగిసిన మూడు రోజుల్లోగా మినిట్స్ (MoM) నివేదిక రూపొందిస్తారు. అనంతరం దానికి అనుగుణంగా "సీఎం సమావేశ పర్యవేక్షణ పోర్టల్" ద్వారా పురోగతిని సమీక్షిస్తారు. ఒకవేళ గడువు పదేపదే ముగిసినా ఫలితం లేకపోతే, సదరు అధికారుల విషయాన్ని నేరుగా చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లనున్నారు.