యుఎన్ సెక్రటరీ జనరల్తో ప్రధాని మోదీ భేటీ
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్తో శుక్రవారం సమావేశమయ్యారు. భారత్ నాల్గవసారి బ్రిక్స్ అధ్యక్ష పదవిని చేపట్టినందుకు ప్రధాని మోదీకి గుటెర్రెస్ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.
ఈ భేటీలో ప్రస్తుత ప్రపంచ వాస్తవాలకు అనుగుణంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలితో సహా వివిధ బహుళపక్ష సంస్థలలో తక్షణ సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరాన్ని ఇద్దరు నాయకులు ఉద్ఘాటించారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న సంఘర్షణలు, నౌకాయాన స్వేచ్ఛ, ఆహార భద్రత, మానవ-కేంద్రీకృత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు పునరుత్పాదక ఇంధన రంగాలలో అభివృద్ధిపై వారు విస్తృతంగా చర్చించారు.
సమావేశం అనంతరం ప్రధాని మోదీ 'X' వేదికగా స్పందిస్తూ.. గుటెర్రెస్తో చర్చలు అద్భుతంగా సాగాయని, బహుపాక్షికవాదాన్ని బలోపేతం చేయడం మరియు ఐరాస సంస్కరణలపై ప్రధానంగా మాట్లాడినట్లు వెల్లడించారు. యుఎన్ సెక్రటరీ జనరల్గా గుటెర్రెస్ మిగిలిన పదవీకాలానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.