22ఏ పేరుతో పేదల భూములు లాక్కుంటే ఊరుకోం..
22ఏ పేరుతో పేదల భూములు లాక్కుంటే ఊరుకోం..
సంగారెడ్డి మేజర్ న్యూస్ ప్రతినిధి : ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, పట్టా భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడం దారుణమని ప్రతిపక్ష నాయకులు మండిపడ్డారు. రాత్రికి రాత్రే ఇళ్లు, ప్లాట్లు, వ్యవసాయ భూములను 22ఏ జాబితాలో చేర్చడంతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.తెలంగాణలో సుమారు 50 వేల ఎకరాల భూములను నిషేధిత జాబితాలో చేర్చారని, ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. నిషేధిత జాబితాలో ఉన్న పేదల ఇళ్లు, భూములను బేషరతుగా 22ఏ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.22ఏ భూముల సమస్యను పరిష్కరించకపోతే సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైఫల్యానికి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి ఆయనను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.