BREAKING
వికారాబాద్ రైల్వే స్టేషన్‌కు మహర్దశ రూ.27 కోట్లతో ఆధునీకరణ.. ఏడాది చివరికి పనులు పూర్తి: కిషన్ రెడ్డి నేపాల్‌లో పెను విషాదం: ఆకస్మిక వరదల్లో 734 మంది మృతి, వేలాదిగా గల్లంతు అంబటి రాంబాబుకు గుండెపోటు: హైదరాబాద్‌ హాస్పిటల్‌లో స్టెంట్ చికిత్స విజయవంతం నేపాల్ వరదలు: ఒడిశాకు చెందిన నలుగురు వ్యక్తులు గల్లంతు.. మరో ఇద్దరు సురక్షితం లక్నోలో వీరాంగన అవంతీ బాయి లోధీ విగ్రహావిష్కరణ.. ₹101 కోట్లతో మోడల్ కంటోన్మెంట్‌కు శంకుస్థాపన ఉదయం ఇలా మొదలుపెడితే.. రోజంతా ఫుల్ ఎనర్జీ! మహిళల హాకీ ప్రపంచ కప్ విజేతగా అర్జెంటీనా: నెదర్లాండ్స్‌పై ఘన విజయం వెంకటేష్ ‘AK47’ రిలీజ్‌పై కొత్త టాక్.. డేట్ మారనుందా? ఫ్యాన్స్‌లో పెరిగిన ఉత్కంఠ! రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం కెప్టెన్సీ మార్పుపై నోరు విప్పిన సూర్యకుమార్ యాదవ్: ఆ నిర్ణయం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది నాని ‘ది ప్యారడైజ్’ నుంచి అదిరిపోయే సాంగ్.. రిలీజ్‌తోనే వైరల్‌గా మారిన ‘యేశనగుల’! రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం 'ఆపరేషన్ సేఫెడ్ సాగర్' ఒక అద్భుతమైన ప్రాజెక్ట్: నటుడు సిద్ధార్థ్ ఇంటర్వ్యూ ఇరుముడి బాక్సాఫీస్ జోరు.. రవితేజ సినిమాకు తగ్గని క్రేజ్! నేపాల్ వరదలు: కాఠ్‌మాండూకు చేరిన నాల్గవ భారత సహాయక విమానం

వికారాబాద్ రైల్వే స్టేషన్‌కు మహర్దశ రూ.27 కోట్లతో ఆధునీకరణ.. ఏడాది చివరికి పనులు పూర్తి: కిషన్ రెడ్డి

Select Suryaa Now
వికారాబాద్ రైల్వే స్టేషన్‌కు మహర్దశ రూ.27 కోట్లతో ఆధునీకరణ.. ఏడాది చివరికి పనులు పూర్తి: కిషన్ రెడ్డి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: వికారాబాద్ రైల్వే స్టేషన్‌లో కొనసాగుతున్న ఆధునీకరణ పనులను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
రూ.27 కోట్లతో స్టేషన్‌ను ఆధునీకరిస్తున్నామని, రెండు లిఫ్టులు, ఎస్కలేటర్లు, క్యాంటీన్, దివ్యాంగులకు ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి పనులు పూర్తవుతాయని వెల్లడించారు. అండర్ బ్రిడ్జి సమస్య పరిష్కారానికి ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి రైల్వే మంత్రితో చర్చిస్తామని చెప్పారు.
కార్యక్రమంలో కలెక్టర్ దీపక్ తివారి, రైల్వే డివిజనల్ మేనేజర్ ఆర్. గోపాలకృష్ణ, అడిషనల్ ఎస్పీ రాజేష్ మీనా, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య తదితరులు పాల్గొన్నారు.