'ఆపరేషన్ సేఫెడ్ సాగర్' ఒక అద్భుతమైన ప్రాజెక్ట్: నటుడు సిద్ధార్థ్ ఇంటర్వ్యూ
ముంబై:నెట్ఫ్లిక్స్లో విడుదలై ఘనవిజయం సాధించిన మిలిటరీ డ్రామా సిరీస్ Operation Safed Sagar విజయంపై ప్రముఖ నటుడు సిద్ధార్థ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సిరీస్ సాధించిన విజయం తన కెరీర్లో ఒక మైలురాయిగా నిలుస్తుందని, ఇది ఒక "జైట్గీస్ట్ ప్రాజెక్ట్" (సమకాలీన సమాజ మనోభావాలను ప్రతిబింబించే ప్రాజెక్ట్) అని ఆయన అభివర్ణించారు. ఈ సిరీస్కు ప్రేక్షకుల నుండి వస్తున్న అద్భుతమైన స్పందన కేవలం తన మార్కెట్ స్థాయిని మాత్రమే కాకుండా, తన వద్దకు వచ్చే కథల శైలిని కూడా పూర్తిగా మార్చేసిందని సిద్ధార్థ్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వార్తా సంస్థ పిటిఐ (PTI) కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సిద్ధార్థ్ మాట్లాడుతూ.. "ఈ సిరీస్ అనే విమానం సురక్షితంగా టేకాఫ్ అయి, అంతే సురక్షితంగా ల్యాండ్ అయినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా దృష్టిలో 'ఆపరేషన్ సేఫెడ్ సాగర్' అంటే ఇదే" అని వ్యాఖ్యానించారు.స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహుజా పాత్రలో సిద్ధార్థ్ ప్రశంసలు1999 కార్గిల్ యుద్ధంలో (Kargil War) భారత వైమానిక దళం (IAF) పోషించిన చారిత్రాత్మక పాత్ర ఆధారంగా ఆరు ఎపిసోడ్లతో ఈ మిలిటరీ డ్రామా రూపొందింది. ఇందులో కార్గిల్ వీరుడు, స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహుజా (Squadron Leader Ajay Ahuja) పాత్రను పోషించిన సిద్ధార్థ్ నటనపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఓని సేన్ దర్శకత్వంలో అభిజీత్ సింగ్ పర్మార్, కుశాల్ శ్రీవాస్తవ సృష్టించిన ఈ సిరీస్లో జిమ్మీ షెర్గిల్, అభయ్ వర్మ, దియా మీర్జా, ప్రాజక్తా కోలి వంటి ప్రముఖ తారాగణం కీలక పాత్రలు పోషించారు.