BREAKING
లక్నోలో వీరాంగన అవంతీ బాయి లోధీ విగ్రహావిష్కరణ.. ₹101 కోట్లతో మోడల్ కంటోన్మెంట్‌కు శంకుస్థాపన ఉదయం ఇలా మొదలుపెడితే.. రోజంతా ఫుల్ ఎనర్జీ! మహిళల హాకీ ప్రపంచ కప్ విజేతగా అర్జెంటీనా: నెదర్లాండ్స్‌పై ఘన విజయం వెంకటేష్ ‘AK47’ రిలీజ్‌పై కొత్త టాక్.. డేట్ మారనుందా? ఫ్యాన్స్‌లో పెరిగిన ఉత్కంఠ! రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం కెప్టెన్సీ మార్పుపై నోరు విప్పిన సూర్యకుమార్ యాదవ్: ఆ నిర్ణయం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది నాని ‘ది ప్యారడైజ్’ నుంచి అదిరిపోయే సాంగ్.. రిలీజ్‌తోనే వైరల్‌గా మారిన ‘యేశనగుల’! రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం 'ఆపరేషన్ సేఫెడ్ సాగర్' ఒక అద్భుతమైన ప్రాజెక్ట్: నటుడు సిద్ధార్థ్ ఇంటర్వ్యూ ఇరుముడి బాక్సాఫీస్ జోరు.. రవితేజ సినిమాకు తగ్గని క్రేజ్! నేపాల్ వరదలు: కాఠ్‌మాండూకు చేరిన నాల్గవ భారత సహాయక విమానం నాగార్జునసాగర్ నీటిపై మళ్లీ పంచాయితీ.. ఏపీ–తెలంగాణ మధ్య పెరిగిన టెన్షన్! టిబెట్-నేపాల్ సరిహద్దుల్లో భారీ వరదల్లో 49 మంది భారతీయులు సహా 261 మంది విదేశీయుల సమాచారం కోసం గాలింపు 25 ఏళ్ల చెట్టు వివాదం.. చివరకు రెండు ప్రాణాలు బలి! సూర్యాపేటలో డబుల్ మర్డర్ వెనుక అసలు కథ ఇదే న్యూఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం: టింబర్ ఫ్యాక్టరీలో ఎగిసిపడిన మంటలు

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

Select Suryaa Now
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
లబ్ధిదారులకు స్మార్ట్ కార్డుల పంపిణీ
రైతులకు మందు పిచికారీ పంపులు, విత్తనాల అందజేత*
వికారాబాద్ జిల్లా ప్రతినిధి , మేజర్ న్యూస్..
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఎ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. వికారాబాద్ జిల్లా దారూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేయడంతో పాటు రైతులకు మందు పిచికారీ పంపులు, విత్తనాలను అందజేశారు.
రైతులకు ప్రభుత్వం అండగా
ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. రైతులకు అవసరమైన వ్యవసాయ వనరులను అందుబాటులోకి తీసుకువచ్చి వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, వ్యవసాయ పరికరాలు అందించడం ద్వారా సాగు ఖర్చులను తగ్గించి, దిగుబడులను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
*పథకాలను సద్వినియోగం చేసుకోవాలి*
ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, వ్యవసాయ పథకాలను అర్హులైన లబ్ధిదారులు, రైతులు సద్వినియోగం చేసుకోవాలని స్పీకర్ సూచించారు. వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులను అవలంబిస్తూ అధిక దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు.
అర్హులందరికీ ప్రయోజనాలు..
ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని గడ్డం ప్రసాద్ కుమార్ సూచించారు. రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కవిత,వ్యవసాయ శాఖ అధికారులు, వివిధ శాఖల అధికారులు, రైతులు, లబ్ధిదారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.