telanagana
నేడు జిల్లాలో కేంద్ర మంత్రి పర్యటన
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్:కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి నేడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను పరిశీలించనున్నారు.
నేడు ఆగస్టు 30, ఆదివారం ఉదయం 6:45 గంటలకు చేవెళ్ల మల్కాపూర్ వద్ద హైదరాబాద్-బీజాపూర్ హైవేపై పసు అను పరిశీలిస్తారు. అనంతరం 8:00 గంటలకు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను పరిశీలించనున్నారు.
అక్కడి నుంచి 10:15 గంటలకు జిల్లాలోని జినుగుర్తి గ్రామంలో తెలంగాణ ఏకలవ్య గ్రామీణ వికాస ఫౌండేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం స్థానిక కార్యకర్తలతో కలిసి ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని వీక్షిస్తారు.మధ్యాహ్నం 1:45 గంటలకు తాండూరు మండలంలోని వీరశైవ కళ్యాణ మండపంలో నిర్వహించే బీజేపీ జిల్లా నూతన జిల్లా అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు.వికారాబాద్ జిల్లాలో పర్యటన అనంతరం మహబూబ్నగర్ జిల్లా పర్యటనలో భాగంగా సాయంత్రం 7:15 గంటలకు జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్లోని జోగులాంబ ఆలయంలో లైట్ అండ్ సౌండ్ షోను ప్రారంభించి, అనంతరం అక్కడే బస చేస్తారు