ప్రతిభకు అంగవైకల్యం అడ్డుకాదు
వికారాబాద్ ప్రతినిధి… ప్రత్యేక అవసరాలు గల ప్రతి విద్యార్థిలోని ప్రతిభను వెలికితీసి వారి భవిష్యత్తుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘని అన్నారు. స్థానిక డైట్ కళాశాలలో CWSN విద్యార్థుల తల్లిదండ్రులకు నిర్వహిస్తున్న రెండు రోజుల అవగాహన సదస్సును ఆయన ప్రారంభించారు. భవిత కేంద్రాల ద్వారా ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, ప్రత్యేక విద్యా శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. సదస్సులో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో CMO రజినీ కుమారి, రిసోర్స్ పర్సన్స్, స్పెషల్ ఎడ్యుకేటర్లు, IERPలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.