మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తా మంత్రి శ్రీధర్ బాబు
సూర్య హుజురాబాద్
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మునిసిపల్ అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. మంగళవారం హైదరాబాదు లోనీ మినిస్టర్స్ క్వార్టర్స్ లో హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో మున్సిపల్ పాలకవర్గం మంత్రిని కలిసి నిధుల మంజూరికే వినతి పత్రం అందజేసింది. అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. హుజురాబాద్ మునిసిపల్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయడానికి కృషి చేస్తానని, కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఇంచార్జ్ ప్రణవ్ బాబు తో పాటు మున్సిపల్ చైర్పర్సన్ రోoటాల సుహాసిని, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు