సిపిఎస్ రద్దుచేసి ఓపిఎస్ అమలు చేయాలి : జిల్లా అధ్యక్షులు కృపాకర్ రెడ్డి,
నారాయణపేట, సూర్యన్యూస్ :
ఎస్ ను రద్దుచేసి వెంటనే ఓపిఎస్ ను అమలు చేయాలని టీఎస్ సిపియు జిల్లా అధ్యక్షులు ఎన్ కృపాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ సిఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో నల్లబ్యాడ్జీలు ధరించి పెన్షన్ విద్రోవ దినాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని 2.6 లక్షల సిపిఎస్ ఉద్యోగులకు వెంటనే ఓపిఎస్ పెన్షన్ అమలు చేయాలని, పిఆర్సి ప్రకటించాలని , పెండింగ్ డిఏ లను విడుదల చేయాలనీ కోరారు. ఎన్నికల మేనిఫెస్టో ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, కృష్ణారెడ్డి, నిర్మల, షఫిక్ అహ్మద్, శంకర్, జైపాల్ రెడ్డి, శ్రీనివాసులు, రాము పాల్గొన్నారు.