ఎబివిపి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కార్యాలయం ముందు ధర్నా
నారాయణపేట, సూర్యన్యూస్ : ప్రభుత్వం విద్యార్థులకు బకాయి పడ్డ రూ. 12వేల కోట్ల ను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ నరేష్ డిబేట్ చేశారు. నారాయణపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు మంగళవారం ఆ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ఎమ్మెల్యే వర్ణిక రెడ్డి అందుబాటులో లేకపోవడం బాధాకరమైన, విద్యారంగ సమస్యల పట్ల నిర్లక్ష్యంగా హరించడం సరికాదన్నారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డికి వినతిపత్రం అందించారు.