BREAKING
తెలంగాణ NEET విద్యార్థులకు గుడ్‌న్యూస్.. MBBS సీట్ల కోసం వెబ్ ఆప్షన్స్ షురూ! మీటింగ్‌కు రానివారిని కమిటీల నుంచి తొలగించాలి ముంబై వాసులకు పాల ధరల షాక్.. సెప్టెంబర్ 1 నుంచి లీటర్‌కు ఏకంగా రూ.110! తూప్రాన్ అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం 22ఏ పేరుతో పేదల భూములు లాక్కుంటే ఊరుకోం.. మళ్లీ విజయ్–రష్మిక జోడీ.. ‘Ranabaali’పై పెరిగిన అంచనాలు, ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్! నాని ‘ది ప్యారడైజ్’పై భారీ హైప్.. ఒక్కో అప్‌డేట్‌తో పెరుగుతున్న అంచనాలు! నాగార్జున 100వ సినిమాకు టైటిల్ ఫిక్స్.. బర్త్‌డే స్పెషల్‌గా ‘King100’ గ్లింప్స్‌తో బిగ్ ట్రీట్! కొత్త కారు పూజలో ఊహించని విషాదం.. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి వద్ద 68 ఏళ్ల వ్యక్తి మృతి! తెలంగాణ NEET విద్యార్థులకు బిగ్ అప్డేట్.. MBBS సీట్ల కోసం వెబ్ ఆప్షన్స్ షురూ! త్రిబుల్ ఆర్ భూసేకరణలో మెదక్ జిల్లా ఉత్తమ పనితీరు.. వారం రోజుల్లో రోడ్డు పనులు ప్రారంభించాలి. నేపాల్ వరదల్లో చిక్కుకున్న 28 మంది ఏపీ యాత్రికులు సేఫ్.. ఊపిరి పీల్చుకున్న కుటుంబాలు! ఎస్‌ఐఆర్‌ నోటీసుల పంపిణీ వేగవంతం చేయాలి ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

మీటింగ్‌కు రానివారిని కమిటీల నుంచి తొలగించాలి

Select Suryaa Now
మీటింగ్‌కు రానివారిని కమిటీల నుంచి తొలగించాలి

మీటింగ్‌కు రానివారిని కమిటీల నుంచి తొలగించాలి
సేవ చేసే నాయకులకే పదవులు ఇవ్వాలి: జగ్గారెడ్డి
సంగారెడ్డి, మేజర్ న్యూస్ ప్రతినిధి: రాజకీయాలంటే కేవలం పదవులు, హోదాలు కాదని, ప్రజలకు సేవ చేయాలనే తపన, ఆసక్తి ఉండాలని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి అన్నారు. శనివారం సంగారెడ్డిలో నిర్వహించిన నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు.పార్టీ సమావేశాలకు హాజరుకాని నాయకులను కమిటీల నుంచి తొలగించి, చురుగ్గా పనిచేసే వారికి అవకాశం కల్పించాలని కమిటీ అధ్యక్షులను ఆదేశించారు. ఇంట్లో కూర్చొని రాజకీయాలు చేసేవారికి పదవులు ఎందుకని ప్రశ్నించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని, కార్యకర్తలకు అందుబాటులో ఉండే వారికే బాధ్యతలు అప్పగించాలని సూచించారు.
ఈ నెల 31న తన కుమారుడు భరత్‌సాయిరెడ్డి నిశ్చితార్థం జరగనున్నందున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తప్పక హాజరుకావాలని జగ్గారెడ్డి కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.