ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు
బ్రిక్స్ సమ్మిట్ మోటార్కేడ్ రిహార్సల్ కోసం 22 దారి మళ్లింపులు
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలో జరగనున్న ‘బ్రిక్స్ సమ్మిట్ 2026’కు సన్నాహకంగా బుధవారం సాయంత్రం మోటార్కేడ్ రిహార్సల్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నగరవ్యాప్తంగా దాదాపు 35కు పైగా ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపులు విధిస్తూ ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక అడ్వైజరీ జారీ చేశారు. సెప్టెంబర్ 11 నుండి 13 వరకు ఈ బ్రిక్స్ సదస్సు జరగనుంది.
బుధవారం సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ప్రగతి మైదాన్లోని భారత్ మండపంలో ఈ రిహార్సల్ జరగనుండటంతో, సెంట్రల్, సౌత్, ఈస్ట్ మరియు న్యూ ఢిల్లీ ప్రాంతాలలోని కీలక మార్గాల్లో 22 దారి మళ్లింపు పాయింట్లు ఏర్పాటు చేశారు. సర్దార్ పటేల్ మార్గ్, అక్బర్ రోడ్, మధుర రోడ్, కనాట్ ప్లేస్, కస్తూర్బా గాంధీ మార్గ్, జన్పథ్, పటేల్ చౌక్, RML హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయి.
ఈ సమయంలో విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినళ్లకు వెళ్లే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని, సమయం వృథా కాకుండా మెట్రో సేవలను ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు. విఐపిల రాకపోకల వేళ బస్సు మార్గాల్లో మార్పులు ఉంటాయని, అలాగే నియంత్రిత రహదారులకు 200 మీటర్ల పరిధిలో నో-పార్కింగ్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు.