పీతాంపురలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా
న్యూఢిల్లీ: పీతాంపుర ప్రాంతంలో మెరుగైన పౌర వసతులు, పారిశుధ్యం మరియు కనెక్టివిటీని అందించడమే లక్ష్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా ఆదివారం పలు కొత్త ప్రజా సౌకర్యాలను ప్రారంభించి, అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
పీతాంపురలోని ST-TP బ్లాక్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధునిక వ్యర్థాల కంపాక్టర్ను సీఎం ప్రారంభించారు. దీని ద్వారా క్రమబద్ధమైన వ్యర్థాల నిర్వహణతో పాటు ప్రాంతంలో మెరుగైన పారిశుధ్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
వైపీ (YP) బ్లాక్లోని 3 పార్కులు, అలాగే డబ్ల్యూపీ (WP) బ్లాక్లోని 10 పార్కులలో సుందరీకరణ పనులను ఆమె అధికారికంగా ప్రారంభించారు. రవాణాను సులభతరం చేసేందుకు శ్రీ గురు గోవింద్ సింగ్ కళాశాల నుండి రింగ్ రోడ్ వరకు నూతన రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
పరిశుభ్రత, పచ్చదనం మరియు మెరుగైన మౌలిక వసతుల కల్పన ద్వారా పీతాంపుర ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడమే తమ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలిపారు.