మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
గౌహతి కళాశాల స్వర్ణోత్సవాల్లో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పిలుపు
గౌహతి:యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ, తమ ఆరోగ్యాన్ని మరియు భవిష్యత్తును కాపాడుకుంటూ అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. గౌహతిలోని గీతానగర్ కళాశాల (గతంలో కన్యా మహావిద్యాలయం) స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన, కళాశాల నూతన విద్యా భవనాన్ని ప్రారంభించారు.
ఉపరాష్ట్రపతి విద్యార్థులు మరియు పాల్గొన్నవారితో కలిసి 'మాదకద్రవ్యాలకు వద్దు' (No to Drugs) అని ప్రతిజ్ఞ చేయించారు. దేశానికి యువతరామే అతిపెద్ద బలమని, ఏఐ, డిజిటల్ టెక్నాలజీ, అంతరిక్షం వంటి రంగాల్లో లభించే అవకాశాలను యువత అందుకోవాలని సూచించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల పురోగతికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. అస్సాం సంస్కృతిని, లచిత్ బోర్ఫుకాన్ వీరత్వాన్ని ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలో విద్యా, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు మరియు తేయాకు తోటల వర్గాల సంక్షేమంలో అస్సాం వేగంగా అభివృద్ధి చెందుతోందని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 6 నుండి 9 వరకు ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి అస్సాంతో పాటు మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు.