BREAKING
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ షురూ.. ఎప్పటినుంచో తెలుసా! విశ్వకర్మ జయంతి వేడుకల్లో ఉప్పల్ ఎమ్మెల్యే మహిమగల తల్లి గుబ్బల మంగమ్మ.. దట్టమైన అడవిలో కొలువైన గిరిజనుల ఆరాధ్య దైవం అమరలింగేశ్వరుడు.. ఉత్తరవాహిని కృష్ణానది ఒడ్డున గుహలో వెలసిన స్వయంభువు ది ప్యారడైజ్’ కంటెంట్ అద్భుతంగా వచ్చింది.. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇంటర్వ్యూ విశేషాలు మెగాస్టార్ కొత్త సినిమా టైటిల్ సంచలనం: 'కాకా' అసలు అర్థమేంటో స్పష్టం చేసిన చిరంజీవి మృణాల్ ఠాకూర్ సస్పెన్స్ థ్రిల్లర్: నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. నేరుగా ఓటీటీలోకి 'పూజా మేరీ జాన్' హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్క్రీన్.. మెగాస్టార్ చిరంజీవి, ఏషియన్ సినిమాస్ భారీ ప్లాన్ T20Iల్లో స్మృతి, షెఫాలీ 'సిక్సర్ల' రికార్డ్: ఏషియన్ గేమ్స్‌లో భారత ఓపెనర్ల విధ్వంసకర ప్రదర్శన కొత్తమ్మతల్లి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధ్వానంగా అంతర్గత రోడ్లు బాలాపూర్ గణనాథుని సన్నిధిలో విజయ్ దేవరకొండ.. ప్రత్యేక పూజలు నిర్వహించిన 'రణబాలి' హీరో! ఒడిశాలో భారీ ఎన్‌కౌంటర్.. పోలీసుల కాల్పుల్లో వాంటెడ్ డ్రగ్ పెడ్లర్‌కు తీవ్ర గాయాలు వినాయక నిమజ్జనంలో దిల్ రాజు దంపతుల మాస్ డ్యాన్స్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్! తిమ్మాపూర్ ఎస్‌బీఐ ఏటీఎంలో అర్ధరాత్రి భారీ చోరీ…

మహిమగల తల్లి గుబ్బల మంగమ్మ.. దట్టమైన అడవిలో కొలువైన గిరిజనుల ఆరాధ్య దైవం

Select Suryaa Now
మహిమగల తల్లి గుబ్బల మంగమ్మ.. దట్టమైన అడవిలో కొలువైన గిరిజనుల ఆరాధ్య దైవం

సూర్య ఆంధ్రప్రదేశ్ డెస్క్: పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం కోర్సవారిగూడెం పంచాయతీ పరిధిలో అందమైన అడవి మధ్యలో ఎత్తైన కొండలు, సెలయేర్ల నడుమ వెలసిన మహిమగల అమ్మవారు గుబ్బల మంగమ్మ భక్తుల పూజలందుకుంటోంది. దట్టమైన అటవీ ప్రాంతంలో గుబ్బలుగా ఉన్న గుహలో వెలయడం వల్ల ఈ పేరు వచ్చింది. గిరిజనుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న మంగమ్మ భక్తుల కోర్కెలు తీర్చే తల్లిగా పేరుపొందడంతో, ప్రతిఏటా లక్షలాది మంది భక్తులు వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు. ఆదివాసీల ఆరాధ్య దైవమైన ఈ అమ్మవారికి గిరిజనులే పూజారులుగా వ్యవహరిస్తుండగా, ఇక్కడ అటవీ ఉత్పత్తులు, రోకళ్లు, వెదురు చేటల విక్రయం ద్వారా అనేక మంది కొండరెడ్డి గిరిజనులు ఉపాధి పొందుతున్నారు.

మంగమ్మతల్లి వెలిసిన సమీపంలో సంతాన వృక్షంగా పేరుగాంచిన గానుగ చెట్టు ఉంది. పిల్లలు పుట్టని దంపతులు అమ్మను దర్శించుకున్నాక పసుపు, కుంకుమను ఎర్రని వస్త్రంలో పెట్టి చెట్టు కొమ్మకు కడితే అమ్మ అనుగ్రహంతో సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రతీ ఆది, మంగళ, శుక్రవారాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని, ఆదివారాల్లో 3 వేల మందికి పైగా, మంగళ, శుక్రవారాల్లో 2 నుంచి 3 వేల మంది వరకూ భక్తులు వస్తుంటారు. కామవరం దాటిన తర్వాత దట్టమైన అడవి మార్గంలో సాగే ఈ ప్రయాణం భక్తులకు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతుంది. జంగారెడ్డిగూడెం నుంచి బుట్టాయగూడెం, దొరమామిడి, గాడిదబోరు, పందిరిమామిడిగూడెం మీదుగా ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవచ్చు.