కోడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. నేడు వరుస ప్రారంభోత్సవాలు
కొడంగల్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 5): ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గానికి చేరుకున్నారు. శుక్రవారం రాత్రి కొడంగల్లో బస చేసిన సీఎం.. శనివారం మధ్యాహ్నం వరకు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలతో నేటి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు సీఎం హాజరుకానున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు కొడంగల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ను ప్రారంభించనున్నారు.
తదుపరి MPPS & ZPHS బాలికల పాఠశాల భవనాన్ని, అనంతరం R&B గెస్ట్హౌస్ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
మధ్యాహ్నం 1 గంటలకు కొడంగల్ నుంచి హైదరాబాద్కు సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు, పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.