ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో ఎమ్మెల్యే కవ్వంపల్లి
సూర్య ఇల్లంతకుంట: మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసుకున్న 40 మంది లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమాల్లో మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ శనివారం పాల్గొన్నారు. పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి దశలవారీగా ఇళ్లు అందిస్తామని తెలిపారు.
అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు నోట్బుక్కులు పంపిణీ చేసి, అంగన్వాడీ కేంద్ర భవనాన్ని ప్రారంభించారు. వల్లంపట్లలో గంగోత్రి మహిళా సంఘం భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమాల్లో ఎంపీడీవో శశికళ, తహసీల్దార్ సురేష్, హౌసింగ్ డీఈ సాజిద్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.