BREAKING
తాండూరులో నిమజ్జనంకు బయలుదేరిన గణేశులు దుగరాజపట్నంలో రూ.15 వేల కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో కట్టిపడేస్తున్న మిస్సింగ్ మేఘన మూవీ రివ్యూ - థ్రిల్లర్ ప్రియులను ఆకట్టుకునేలా కొత్త చిత్రం పర్యావరణ పరిరక్షణతో పాటు వెదురు ఆధారిత వృత్తులను ప్రోత్సహించాలి . నిజ జీవిత పాత్రలతో వెండితెరపై మాయ చేసిన నాయికలు - బయోపిక్‌లలో అద్భుత నటనతో మెప్పించిన అగ్ర నటీమణులు 5వ రోజు ఆకాశ వర్ణంలో దర్శనమిస్తున్న శ్రీ సిద్ధి వినాయక స్వామి. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి:ఎస్సై మొగుళ్ళ శోభన్ బాబు రణబాలి చిత్రం నుంచి ఎందయ్యా సామి మొదటి పాట విడుదల తేదీ ఖరారు - విజయ్ దేవరకొండ, రష్మిక జోడీ సందడి కొత్త విడుదల తేదీతో వస్తున్న కళ్యాణం కమనీయం జీవితం - సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు చిత్రం గణనాధుని సేవలో మాద్రి పృథ్వీరాజ్ ఇనుముల నర్సయ్యకు బీఆర్ఎస్ నాయకుల నివాళి* జాంబీల ప్రపంచంలోకి రియల్ స్టార్ ఉపేంద్ర ఎంట్రీ - జాంబీ రెడ్డి 2 నుంచి అదిరే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల ఎబ్బనూరు అడవిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి సేవా సంకల్ప అభియాన్: మహిళల అభ్యున్నతికి సినీ ప్రముఖుల సంచలన నిర్ణయాలు - రామ్‌చరణ్, రణ్‌వీర్ సింగ్ బాటలో ప్రముఖులు

అమృత్ భారత్ పనులు వేగవంతం చేయాలి: డీఆర్‌ఎం డా. గోపాలకృష్ణ

Select Suryaa Now
అమృత్ భారత్ పనులు వేగవంతం చేయాలి: డీఆర్‌ఎం డా. గోపాలకృష్ణ

అమృత్ భారత్ పనులు వేగవంతం చేయాలి: డీఆర్‌ఎం డా. గోపాలకృష్ణ
మిర్యాలగూడ అర్బన్ ,మేజర్ న్యూస్ సెప్టెంబర్ : అమృత్ భారత్ పథకం కింద చేపడుతున్న రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) డాక్టర్ గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు.
గురువారం మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, నిర్మాణంలో ఉన్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. స్టేషన్‌లో ప్రయాణికులకు అందిస్తున్న సౌకర్యాలు, జరుగుతున్న పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా రెండో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై ఏర్పాటు చేసిన సిగ్నల్ ఫోన్లు పనిచేయకపోవడాన్ని గమనించిన డీఆర్‌ఎం, వాటిని తక్షణమే మరమ్మతు చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అలాగే గూడ్స్ షెడ్‌లో సౌకర్యాలను మెరుగుపరచాలని, అవసరమైతే అదనపు నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.
నడికుడి–బీబీనగర్ డబుల్ లైన్ నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని గుత్తేదారులకు స్పష్టం చేశారు. ఈ తనిఖీలో రైల్వే వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.