BREAKING
ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం దానం నాగేందర్‌కు హైకోర్టులో షాక్‌... ఎమ్మెల్యేగా అనర్హత వేటు! 2027 ఆస్కార్స్ పోటీలో మరాఠీ చిత్రం ‘గొంధల్’ ది ప్యారడైజ్ లాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు.. బెంగళూరు ప్రెస్ మీట్‌లో నాని ఆసక్తికర వ్యాఖ్యలు ప్రధాని మోదీ సాంకేతిక దార్శనికతతో బలోపేతమవుతున్న డిజిటల్ భారత్ పాకిస్థాన్ మసీదులో ఆత్మాహుతి దాడి ప్రేమలు ఫేమ్ భావన స్టూడియోస్ నుంచి కొత్త సినిమా పిక్నిక్.. ఫస్ట్ లుక్ విడుదల మరియు రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ మిశ్రమ ఫలితాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు జీ5లో ఉత్కంఠభరితమైన సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ఆక్టోపస్.. ఆకట్టుకునే రహస్యాల కథనం గజాసురుడికి నందీశ్వరుడికి మధ్య జరిగిన భీకర పోరాట రహస్యం ఇదే జైలర్ 2 సినిమాలో సూరజ్ వెంజరమూడు పవర్‌ఫుల్ రోల్.. రజినీకాంత్ చిత్రంలో కీలక పాత్ర రివీల్ తాండూరులో అంగరంగ వైభవంగా వినాయకుల నిమజ్జనం భక్తి చాటిన ఏలూరి మాధవరావు ఆసియా క్రీడల్లో క్విమ్సీ సంచలనం వరల్డ్ ఆఫ్ వెట్టువం గ్లింప్స్ విడుదల.. ప్రాచీన యుద్ధ కళలతో శోభిత ధూళిపాల అదరగొట్టే యాక్షన్

వినియోగదారులకు భారీ శుభవార్త

Select Suryaa Now
వినియోగదారులకు భారీ శుభవార్త

చక్కెర నిల్వ పరిమితి 30 రోజులకు పెంపు!
న్యూఢిల్లీ: రాబోయే పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని భారీ చక్కెర వినియోగదారులకు (నెలకు 10 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ వాడే పరిశ్రమలు) కేంద్ర ప్రభుత్వం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. వీరి చక్కెర నిల్వ పరిమితిని 15 రోజుల నుండి 30 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే, అదనంగా ఉంచే 15 రోజుల నిల్వలను తప్పనిసరిగా 'అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్' (AAS), 'టారిఫ్ రేట్ కోటా' (TRQ) కింద దిగుమతి చేసుకున్న చక్కెర నుండే సేకరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఓపెన్ మార్కెట్ కొనుగోళ్లకు పాత 15 రోజుల నిల్వ పరిమితి నిబంధనే వర్తిస్తుంది.

అంతేకాకుండా, భారీ వినియోగదారులు తమ వద్ద ఉన్న నిల్వల వివరాలను ప్రతి శుక్రవారం 'ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ' ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దిగుమతి చేసుకున్న చక్కెర వినియోగం వల్ల దేశీయ సరఫరాపై ప్రభావం పడకుండా పారిశ్రామిక అవసరాలు నిరంతరాయంగా సాగుతాయని ప్రభుత్వం పేర్కొంది.

గరిష్ట స్థాయిలతో పోలిస్తే చిల్లర మార్కెట్‌లో చక్కెర ధరలు 10% మేర తగ్గి, ఆగస్టులో ఉన్న ₹65 నుండి ప్రస్తుతం ₹58.50కి చేరాయని ప్రభుత్వం తెలిపింది. అయితే మిల్లుల వద్ద (Ex-mill) చక్కెర ధరలు ఏకంగా 25% తగ్గినప్పటికీ, ఆ ప్రయోజనం వినియోగదారులకు ఇంకా పూర్తిగా చేరలేదని గుర్తిస్తూ... వెంటనే ఆ తగ్గింపును చిల్లర ధరలలో ప్రతిబింబించేలా చూడాలని వ్యాపారులకు విజ్ఞప్తి చేసింది. కాగా, అక్టోబర్ 1 నుండి ప్రారంభమయ్యే కొత్త సీజన్ నుండి చెరకు రైతులకు 'న్యాయమైన మరియు లాభదాయక ధర' (FRP) క్వింటాలుకు ₹365 లభిస్తుందని వెల్లడించింది.