☼ Suryaa News
🔴 తెలంగాణ మట్టి గణపయ్యకు తొలి పూజ చేసిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి (బి ఎస్ ఆర్ )
తెలంగాణ

మట్టి గణపయ్యకు తొలి పూజ చేసిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి (బి ఎస్ ఆర్ )

14 Sep 2026 Reporter

 

బిఎస్ఆర్ దంపతుల ఆధ్వర్యంలో జక్కేపల్లి ఆర్బిఓఎల్ సంస్థల్లో వినాయక చవితి వేడుకలు

విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందరిపై ఉండాలి.. బీఎస్ఆర్

యాలాల, సెప్టెంబర్ 14: యాలాల మండలంలోని జక్కేపల్లి ఆర్బిఓఎల్ సంస్థల్లో వినాయక చవితి వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సంస్థ ప్రాంగణంలో ప్రతిష్ఠించిన మట్టి గణపతి విగ్రహానికి సంస్థ అధినేత బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి (బిఎస్ఆర్), సరళారెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముందుగా గణనాథుడికి పుష్పాలతో అందంగా అలంకరించి, పసుపు, కుంకుమ, పుష్పాలు, పత్రాలతో పూజలు చేశారు. అనంతరం నైవేద్యాలు సమర్పించి, మంగళహారతి నిర్వహించారు. ‘విఘ్నేశ్వరా.. విఘ్నాలు తొలగించి సుఖశాంతులు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలి’ అంటూ గణపయ్యను భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, రాష్ట్ర ప్రగతి నిరంతరం కొనసాగాలని,ప్రజలందరికీ సుఖసంతోషాలు,ఐశ్వర్యం కలగాలని బిఎస్ఆర్ దంపతులు గణనాథుడిని ప్రార్థించారు. మట్టి గణపతిని ప్రతిష్ఠించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిచ్చినట్లు తెలిపారు.
వినాయక చవితి వేడుకల్లో ఆర్బిఓఎల్ సంస్థల సిబ్బంది,మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొని ‘గణపతి బప్పా మోరియా’అంటూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.పూజా కార్యక్రమాలతో సంస్థ ప్రాంగణం భక్తి పారవశ్యంతో మార్మోగింది.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home