నెస్ట్ వృద్ధాశ్రమాన్ని సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి.
అమీన్పూర్, ... జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి బి. సౌజన్య శుక్రవారం అమీన్పూర్లోని శ్రీవాణి నగర్లో ఉన్న నెస్ట్ వృద్ధాశ్రమాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలోని వృద్ధులతో ఆమె ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వృద్ధాశ్రమంలో వారికి అందుతున్న వసతులు, ఆహారం, వైద్య సదుపాయాలు, పరిశుభ్రత, భద్రత, తదితర అంశాలను పరిశీలించారు.వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్ధుల అవసరాలు, సమస్యలను అడిగి తెలుసుకొని, వారికి అవసరమైన న్యాయపరమైన సహాయం మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పించారు. వృద్ధుల హక్కుల పరిరక్షణకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందుబాటులో ఉంటుందని తెలిపారు.వృద్ధులను గౌరవించడం, వారి పట్ల ప్రేమాభిమానాలతో వ్యవహరించడం ప్రతి ఒక్కరి బాధ్యతని ఆమె పేర్కొన్నారు. వృద్ధులు తమకు ఎదురయ్యే ఏవైనా న్యాయపరమైన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని, అవసరమైతే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని తెలిపారు.అలాగే వృద్ధాశ్రమంలో వృద్ధులకు అందుతున్న సేవలను నిరంతరం పర్యవేక్షిస్తూ, వారి సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమం నిర్వాహకులు, సిబ్బంది, ఇతరులు పాల్గొన్నారు.