అనంతపురం నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో ద్విచక్ర వాహనం లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కేఫ్ సమీపంలో ఆగి ఉన్న ద్విచక్ర వాహనంలో మంటలు చెలరేగడంతో స్థానికంగా ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇందులో భాగంగా ఎండ వేడిమికి ద్విచక్ర వాహనం అంటుకుందని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్