BREAKING
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్ నిరసనలు… ఆటో కార్మికుల హామీల అమలులో వైఫల్యాన్ని నిరసిస్తూ భారీ ఆటో ర్యాలీ… 'సీఎస్ఎస్ షీల్డ్' కార్యక్రమానికి జితేంద్ర సింగ్ మద్దతు యాక్సెస్ అండ్ బెనిఫిట్-షేరింగ్ నిధుల పంపిణీలో రూ. 200 కోట్ల మైలురాయిని దాటిన జాతీయ జీవవైవిధ్య అథారిటీ కోల్ ఇండియా బొగ్గు ఉత్పత్తి, సరఫరా వేగవంతం వడోదరలో ఉత్సాహంగా ఫిట్ ఇండియా, సైక్లోథాన్ పాట్నాలోని మనేర్ దియారా ప్రాంతంలో ప్రవాహ ఉధృతి ఇండోనేషియాలో 200 పైగా విమానాలు రద్దు లండన్ హీత్రూ విమానాశ్రయానికి నిలిచిపోయిన రైళ్లు ఈజిప్టులో డ్రగ్స్ కేసులో 11 మందికి మరణశిక్ష ఇండోర్ మెట్రో ప్రయారిటీ కారిడార్-2 ప్రారంభం ఉత్తరాఖండ్‌లో కుండపోత వర్షాలు సిక్కింలో కొండచరియలు విరిగిపడి తీస్తా,చ్యకూంగ్ నదుల ప్రవాహానికి అంతరాయం 'దినమలర్' 75వ వార్షికోత్సవం సాక్ష్యాధారిత గుండె సంరక్షణను బలోపేతం చేయడానికి 'ఇండియా వాల్వ్ రిజిస్ట్రీ' ప్రారంభం తైవాన్‌ను ఏకాకిని చేసేందుకు చైనా కుట్రలు

సాంకేతికతను అందిపుచ్చుకోవాలి, వినూత్న బోధన చేపట్టాలి

Select Suryaa Now
సాంకేతికతను అందిపుచ్చుకోవాలి, వినూత్న బోధన చేపట్టాలి

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, వినూత్న బోధనా పద్ధతులను అవలంబించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. భారత మాజీ రాష్ట్రపతి, గొప్ప తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయనకు వినయపూర్వక నివాళులు అర్పించారు.

విద్యార్థుల్లోని విశిష్ట సామర్థ్యాలను గుర్తించి, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైంది. మారుతున్న కాలానికి అనుగుణంగా అధ్యాపకులు నిరంతరం తమ జ్ఞానాన్ని నవీకరించుకోవాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని బోధనలో భాగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులలో స్వతంత్ర ఆలోచనా ధోరణిని, పరిశోధనాత్మక స్ఫూర్తిని పెంపొందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు.

దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే విజ్ఞానవంతమైన తరాలను తీర్చిదిద్దడంలో అంకితభావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ రాష్ట్రపతి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.