పెదబయలు, సెప్టెంబర్ 20, మేజర్ న్యూస్ : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని పంచాయతీలకు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని అరకు వేలు ఎమ్మెల్యే రేగం మచ్చలింగం కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఆదివారం పార్టీ మండల అధ్యక్షుడు మజీద్ చంద్రబాబు ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారుస్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత, కావాలన్నారు బూత్ కమిటీల పటిష్టత ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించా రూ
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మనమంతా ఏకతాటిపై వెళ్లాలని,ఒకే స్థానానికి ముగ్గురు పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయమని,అందుకే ముగ్గురిని కూర్చోబెట్టి బలమైన ఒక్కరినే అభ్యర్థిగా నిలబెట్టాలని స్పష్టమైన దిశానిర్దేశం చేసామన్నారు .
జగన్ ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఐడీ కార్డు కేవలం గుర్తింపు కార్డు మాత్రమే కాదని,అది కార్యకర్తకు రక్షణ కవచమని అన్నారు.
ఈ కార్డు ద్వారా రూ.2 లక్షల ప్రమాద బీమా లభిస్తుందని,ప్రతి కార్యకర్త దీనిని బాధ్యతగా కాపాడుకోవాలని సూచించారు.
పార్టీ కోసం కష్టపడే వారికే టికెట్ ఇస్తామని, పిలుపునిచ్చారు. ఇంజారి పంచాయతీకి చెందిన పలువురి కూటమి నాయకులు వైఎస్ఆర్సిపి పార్టీలో చేరినట్లు వారు వివరించారు
ఈ కార్యక్రమంలో
జడ్పిటిసి బొంజు బాబు మాజీ జెడ్పిటిసి గంగాభవాని
మాజీ సర్పంచ్లు తెరవాడ వెంకట్రావు ,నాగరాజు మాజీ ఎంపిటిసిలు సర్పంచులు కార్యకర్తలు పాల్గొన్నారు