పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది : జిల్లా పంచాయతీ అధికారి టి.నాగరాజ నాయుడు*
- *: ఆత్మకూరులో ఘనంగా స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహణ*
అనంతపురం బ్యూరో
ఆత్మకూరు మండలం, ఆత్మకూరు గ్రామ పంచాయతీ పరిధిలో శనివారం స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా హరిత ఆంధ్ర - శీతల ఆంధ్ర అనే థీమ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా పంచాయతీ అధికారి టి.నాగరాజ నాయుడు, అనంతపురం డివిజనల్ పంచాయతీ అధికారి బి.శకుంతల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి, ఉప మండల అభివృద్ధి అధికారి, మండల స్థాయి అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి మాట్లాడుతూ, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ప్రతి ఇంట్లో చెత్తను 4 రకాలుగా వేరు చేయాలని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి మొక్కలు నాటడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ను హరిత ఆంధ్రగా, శీతల ఆంధ్రగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. అలాగే SWPC షెడ్ పరిధి లో మొక్కలు నాటడం జరిగింది. మరియు చెత్త నుండి సంపద తయారీ కేంద్రం నందు ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి విద్యార్థులకు తెలియజేసారు. పరిశుభ్రతే సేవ(స్వచ్ఛత హి సేవ) కార్యక్రమంలో లో భాగంగా SWPC షెడ్ నుంచి ఎంపిడిఓ కార్యాలయం ఆత్మకూరు వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం SWPC కార్యకలాపాలపై పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. కన్వేయర్ ద్వారా మిశ్రమ పొడి వ్యర్థాలను వేరు చేయడం, బేలింగ్ యంత్రం పనిచేయడం....ప్లాస్టిక్ వ్యర్థాలను నొక్కడం, ష్రెడ్డింగ్ యంత్రం ద్వారా ప్లాస్టిక్ పదార్థాన్ని చిన్న ముక్కలుగా చేయడం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.