అనంతపురం బ్యూరో
గుత్తి పట్టణం నందు మంచి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం
గుత్తి పట్టణం నందు *జిందాల్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 250 కోట్ల మంచి నీటి మరియు ఇంటింటి మంచినీటి కొళాయి భూమి పూజ కార్యక్రమానికి*
ముఖ్య అతిథులుగా హాజరైన
*గుంతకల్లు నియోజకవర్గం శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం మరియు అనంతపురం జిల్లా పార్లమెంట్ ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్
ముందుగా ఎమ్మెల్యే గారికి కూటమి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన
*250 కోట్ల రూపాయలతో మంచి నీటి పైపులైను మరియు ఇంటింటికి మంచి నీటి కొళాయి కు భూమి పూజ చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రోజు మన నియోజకవర్గ చరిత్రలోనే ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి లేకుండా చేయడం, ప్రతి ఇంటికీ పరిశుభ్రమైన సురక్షిత నీరు అందించడమే లక్ష్యంగా రూ. 250 కోట్ల భారీ బడ్జెట్తో మంచినీటి పైప్లైన్ మరియు ఇంటింటికీ కొళాయి పనులకు భూమి పూజ చేసుకుంటున్నాం మైళ్ల కొద్దీ నడిచి నీళ్లు తెచ్చుకునే ఆడబిడ్డల కష్టాలకు ఈ ప్రాజెక్టుతో శాశ్వత పరిష్కారం లభిస్తుంది శుద్ధమైన తాగునీరు అందడం వల్ల నీటి ద్వారా వచ్చే వ్యాధులు తగ్గి ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుంది భవిష్యత్తు అవసరాలు రాబోయే 20-30 సంవత్సరాల జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ పైప్లైన్ వ్యవస్థను డిజైన్ చేయడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం మన ప్రాంతంలో నీటి సమస్య లేకుండా చేసేందుకు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయడానికి కట్టుబడి ఉంది ఈ పనులు త్వరలోనే పూర్తయి, ప్రతి ఇంట్లో మంచినీటి కొళాయి ద్వారా నీరు వచ్చేలా అధికారులు రాత్రింబవళ్లు శ్రమిస్తారు తెలిపారు అలాగే జరగబోయే
*స్థానిక సంస్థ ఎలక్షన్లలో కూటమి ప్రభుత్వం తరఫున ఎవరు పోటీ చేసిన గెలిపించుకొని తీరాలని తెలియజేశారు ఇంకా రాబోయే రోజులలో మన గుంతకల్లు నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడిపిస్తానని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను*
ఈ కార్యక్రమంలో జిందల్ వ్యవస్థ వారు అలాగే ప్రభుత్వ అధికారులు మరియు పెద్ద ఎత్తున మహిళలు మరియు గుత్తి పట్టణం మరియు మండలం కూటమి నాయకులు కార్యకర్తలు హాజరు కావడం జరిగింది...