భక్తిశ్రద్ధలతో గణనాథుడిని దర్శించుకున్న కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న
సూర్య కరీంనగర్ ప్రతినిధి::
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు చామనపల్లి గ్రామంలోని వివిధ వినాయక మండపాలను కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న సందర్శించారు. ఆయా మండపాల్లో గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని వినాయక స్వామివారిని ప్రార్థించారు.ఈ కార్యక్రమానికి ఏఎంసీ డైరెక్టర్ చిక్కని కనకయ్య ఆహ్వానం అందించగా, ఆయనతో పాటు చామనపల్లి గ్రామ సర్పంచ్ పోగొండ ఐలన్న, ఉప సర్పంచ్ శ్రీనివాస్, పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు శంకరయ్య, బుర్ర గంగయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.అలాగే చామనపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ మండపాల నిర్వాహకులు, గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాల్లో భాగస్వాములయ్యారు.ఈ సందర్భంగా వివిధ వినాయక మండపాల నిర్వాహకులు, కమిటీ సభ్యులు మరియు గ్రామస్థులు మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్నను శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.అనంతరం ఆకుల నరసన్న భక్తులతో కలిసి వినాయక స్వామివారిని దర్శించుకుని, ఉత్సవాల నిర్వహణ తీరును పరిశీలించారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.