గణనాధుని సేవలో మాద్రి పృథ్వీరాజ్
పటాన్ చెరు… పటాన్ చెరు పట్టణంలోని శాంతినగర్, గౌతమ్ నగర్, జెపి కాలనీ, వెంకటేశ్వర కాలనీ, బండ్లగూడ కాలనీలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించిన మాద్రి పృథ్వీరాజ్, గణనాధుని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వినాయక మండపాల వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు.విఘ్నాలను తొలగించి, ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని శ్రీ విఘ్నేశ్వర స్వామిని ప్రార్థించారు…