పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు
రామచంద్రపురం ; శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రామచంద్రపురం 268 డివిజన్ లో బిఆర్ఎస్ పార్టీ పటాన్చెరు సర్కిల్ అధ్యక్షులు పరమేశ్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు పెద్దలు గూడెం మధుసూదన్ రెడ్డి మరియు మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య హాజరై బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం రామచంద్రాపురం లోని ఈఎస్ఐ హాస్పిటల్ లో రోగులకు పండ్లు మరియు బ్రేడ్ లు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రం లోనే పటాన్చెరు నియోజికవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దదానికి నిరంతరం పాటుపడుతున్న గూడెం మహిపాల్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అని అన్నారు పటాన్చెరు నియోజకవర్గం అభివృద్ధి కేవలం జీఎంఆర్ తోనే సాధ్యం అని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు