☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ పల్లెనిద్రతో ప్రజలకు చేరువగా ఎస్‌ఐ అనూక్
ఆంధ్రప్రదేశ్

పల్లెనిద్రతో ప్రజలకు చేరువగా ఎస్‌ఐ అనూక్

13 Sep 2026 Reporter

పల్లెనిద్రతో ప్రజలకు చేరువగా ఎస్‌ఐ అనూక్

  • పల్లె నిద్రలో పాల్గొన్న టిడిపి విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడుసుల్లి ప్రభాకర్ చౌదరి 

పామూరు, మేజర్ న్యూస్ : మండలంలోని బొట్లగూడూరు గ్రామంలో ఆదివారం రాత్రి  పల్లెనిద్ర కార్యక్రమాన్ని సబ్‌ఇన్‌స్పెక్టర్‌ అనూక్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలో రాత్రి బస చేస్తూ ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకునే దిశగా పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ కార్యక్రమంలో  తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడుసుమల్లి ప్రభాకర్‌ చౌదరి ఎస్‌ఐ అనూక్‌తో కలిసి పాల్గొన్నారు. గ్రామంలో శాంతిభద్రతల పరిస్థితిని పరిశీలిస్తూ ప్రజలకు పోలీసుల సేవలు మరింత చేరువయ్యేలా చేపడుతున్న చర్యలను పరిశీలించారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు.

కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు కోటపాటి వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్‌ ఎర్రగొల్ల బాల, అనపర్తి మహేశ్వరరావు, కోటపాటి రాజా, గూడూరు వెంకటాద్రి, గ్రామస్తులు పాల్గొన్నారు. 

 

 

Advertisement
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్

వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచే పోటీ చేస్తా: స్పష్టం చేసిన సీనియర్ రాజకీయ నేత బొత్స సత్యనారాయణ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

తిరుమల కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్ట్.. ఈడీ అదుపులో ప్రధాన నిందితుడు

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

వైయస్సార్ కడప జిల్లా

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

అర్చకుల సమస్యలకు పరిష్కార బాట! నెల రోజుల్లో చర్యలు.. వినతులపై దేవాదాయ శాఖ భరోసా అనంతపురం క్రైమ్ మేజర్ న్యూస్. అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బి. సుధారాణి హామీ ఇచ్చారు. అనంతపురం నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో గురువ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

భక్తి చాటిన ఏలూరి మాధవరావు

🕑 18 Sep 2026
Advertisement
↗ Full Article ← Home