☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ ఘనంగా యోగా కార్యక్రమం..
ఆంధ్రప్రదేశ్

ఘనంగా యోగా కార్యక్రమం..

20 Sep 2026 vizagsrinivas

విశాఖపట్న, సెప్టెంబర్ 20, మేజర్ న్యూస్ : నేషనల్ యోగ స్పోర్ట్స్ అసోసియేషన్, విశాఖపట్నం జిల్లా యోగా సంఘం  ఆధ్వర్యంలో  విశాఖపట్నం జిల్లా యోగా స్థాయి పోటీలు ఆంధ్ర యూనివర్సిటీ యోగ విలేజ్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా డాక్టర్ కే. రమేష్ బాబు  స్పెషల్ గెస్ట్స్  కె ఎస్ ఎన్ రాజు విచ్చేసి ఈ కార్యక్రమం జ్యోతి ప్రతిపాదన చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పిల్లలు పెద్దలు మొత్తం 300 మంది పాల్గొన్నారు. ఆడవాళ్ళకి  వేరేగా మగ పిల్లలకు వేరేగా గ్రూపులుగా నిర్ణయించి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు ఇందులో ఉత్తీర్ణులైన , వారికి రాష్ట్రస్థాయి యోగాసనా పోటీలకు తదుపరి జాతీయస్థాయి యోగాసనా పోటీలకు పంపడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమం యోగారాజు( కేఏ రాజు)  ఆధ్వర్యంలో సాయి ,కిరణ్ కుమార్, ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందన్నారు. విద్యార్థిని విద్యార్థులకు  పెద్దవారికి మేమంటోసు మెడల్స్ ఇవ్వడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home