☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ అనంతపురంలో చిరుతల బీభత్సం: టమాటా తోటలో 7 జింకల మృతి!
ఆంధ్రప్రదేశ్

అనంతపురంలో చిరుతల బీభత్సం: టమాటా తోటలో 7 జింకల మృతి!

14 Sep 2026 Reporter

 అనంతపురం జిల్లా తాటిచర్లలో చిరుతల దాడిలో ఏడు జింకలు మృతి చెందాయి. పొలం చుట్టూ ఉన్న కంచె కారణంగా జింకలు తప్పించుకోలేక ప్రాణాలు కోల్పోగా, స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
అనంతపురం రూరల్ మండలం తాటిచర్ల గ్రామంలో చిరుతపులుల దాడి కలకలం రేపింది. స్థానిక రైతు నరసింహారెడ్డి తన టమాటా తోట చుట్టూ వన్యమృగాల రక్షణ కోసం కంచె ఏర్పాటు చేశారు. సమీప అడవి నుంచి పంట మేసేందుకు వచ్చిన ఏడు జింకల మందను వెంబడిస్తూ రెండు చిరుతలు తోటలోకి ప్రవేశించాయి.
ప్రాణభయంతో తప్పించుకునేందుకు యత్నించిన జింకలు, పంట కంచె అడ్డుగా ఉండటంతో బయటకు వెళ్లలేకపోయాయి. దీంతో చిరుతలు దాడి చేసి ఏడు జింకలనూ హతమార్చాయి. ఉదయం తోటకు వచ్చిన రైతు జింకల కళేబరాలను గమనించి వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు వివరాలు సేకరించి విచారణ చేపట్టారు. గ్రామ పరిసరాల్లో చిరుతల సంచారంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నామని, వెంటనే వాటిని బంధించాలని తాటిచర్ల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్

వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచే పోటీ చేస్తా: స్పష్టం చేసిన సీనియర్ రాజకీయ నేత బొత్స సత్యనారాయణ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

తిరుమల కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్ట్.. ఈడీ అదుపులో ప్రధాన నిందితుడు

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

వైయస్సార్ కడప జిల్లా

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

అర్చకుల సమస్యలకు పరిష్కార బాట! నెల రోజుల్లో చర్యలు.. వినతులపై దేవాదాయ శాఖ భరోసా అనంతపురం క్రైమ్ మేజర్ న్యూస్. అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బి. సుధారాణి హామీ ఇచ్చారు. అనంతపురం నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో గురువ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

భక్తి చాటిన ఏలూరి మాధవరావు

🕑 18 Sep 2026
Advertisement
↗ Full Article ← Home