ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అలా చేస్తే వాహనదారుల,,,, పర్మిట్, లైసెన్స్ రెండు రద్దు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 22, 2025, 07:20 PM

ఈమధ్య కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. ప్రతి రోజు ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదం జరుగుతూనే ఉంది. ప్రమాదాల నివారణ కోసం ప్రభుత్వాలు, అధికారులు అనేక చర్యలు తీసుకుంటున్నా ఆశించిన ఫలితం రావడం లేదు. ఇక తాజాగా చేవెళ్ల దగ్గర చోటు చేసుకున్న ప్రమాదమే ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలో తెలంగాణ రవాణా శాఖ అధికారులు మరింత కఠిన నియమాలు అమలు చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే అమలవుతున్న సంస్కరణలను మరింత కఠినతరం చేయాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గించి.. మరణాల రేటును తగ్గించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.


ప్రమాదాల నివారణకు, సంస్కరణలను కఠినంగా అమలు చేయడం కోసం రవాణా శాఖ అధికారులు ఇప్పటికే 33 జిల్లా స్థాయి బృందాలు, 3 రాష్ట్రస్థాయి ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో డీటీసీ, ఆర్టీఏ, ఇతర అధికారులు ఉంటారు. వీరు నిరంతరం తనిఖీలు చేపడుతున్నారు. అలానే ముందస్తు సమాచారం లేకుండా.. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి ఆయా బృందాలు తనిఖీలు చేయడానికి వెళ్లిపోతున్నాయి. ఎప్పుడు.. ఎక్కడ తనిఖీ చేస్తారు అనే దాని గురించి ఏమాత్రం బయటకు తెలియనివ్వడం లేదు.


గత పది రోజులుగా ఇలానే రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు నిర్వహించి రోడ్డు నిబంధనలు ఉల్లంఘించిన వారి మీద కేసులు నమోదు చేస్తున్నారు. ఈ పది రోజుల వ్యవధిలో నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను 4,748 కేసులు నమోదు చేశారు. తనిఖీల్లో భాగంగా మొత్తం 3,420 వాహనాలు సీజ్ చేశారు. ఈ అంశం మీద తెలంగాణ రవాణ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు మరింత ముమ్మరంగా తనిఖీలు చేయాలని ఆదేశించారు.


ఓవర్‌లోడ్ వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని.. అందుకే అధికారులు దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలని మంత్రి పొన్నం ఆదేశించారు. ఓవర్‌లోడ్ వాహనాలను సీజ్ చేయాలని.. సదరు వాహనాలు రెండో సారి కూడా ఓవర్‌లోడ్‌తో పట్టుబడితే.. వాటి పర్మిట్ మాత్రమే కాక.. ఆ వెహికల్ నడుపుతున్న డ్రైవర్.. డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలానే ఓవర్‌లోడ్ అంశంపై మైనింగ్ శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అంటే ఎక్కడైతే వాహనాల లోడింగ్ జరుగుతుందో.. అక్కడే వాటిల్లో ఓవర్‌లోడ్ నివారించేలా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa