సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం అయిన ఓట్ల లెక్కింపు 24 కొనసాగుతూనే ఉండగా.. బుధవారం తెల్లవారుజామున 11 రౌండ్ ముగిసింది. దీంతో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫస్ట్ రౌండ్ నుంచి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఆధిక్యం కొనసాగిస్తుండగా.. కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థులు తీవ్ర పోటీ ఇస్తున్నారు. మూడు రోజులుగా ఉత్కంఠ రేపుతున్న ఈ ఫలితంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో 10 వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తవ్వగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి లీడ్ దక్కింది. ఈ పదో రౌండ్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 6869 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 6347 ఓట్లు వచ్చాయి.అలాగే బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 5952 ఓట్లు వచ్చాయి. దీంతో 10వ రౌండ్ పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 70740 ఓట్లు రాగా.. రెండో స్థానంలో ఉన్న నరేందర్ రెడ్డికి 66178 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి 4562 ఓట్ల లీడ్ లో కొనసాగుతున్నారు. అనంతరం పదకొండో రౌండ్ ముగిసే సమయానికి బీజేపీ అభ్యర్థి 5 వేల పైచిలుకు ఓట్ల లీడ్ లో కొనసాగుతుండగా.. మరికాసేపట్లో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa