నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 05వ తేదీన మొదలై 25 వ వరకు జరగనున్నాయి. బుధవారం ఇంటర్ ఫస్ట్ ఇయర్, గురువారం ఇంటర్ సెంకడియర్ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 1,532 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల వరకు విద్యార్థులను అనుమతిస్తారు. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కు 4 లక్షల 88 వేల 448 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇక సెకండియర్లో 5లక్షల8 వేల523 విద్యార్థుల చొప్పున హాజరుకానున్నారు. వాచ్, స్మార్ట్ వాచ్, అనలాగ్ వాచ్లపై అధికారులునిషేధం విధించారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరీక్ష రాసే విద్యార్థులు ఉదయం 8 గంటల 45 నిమిషాలకు ఎగ్జామ్ సెంటర్ లోకి వెళ్లడం ఉత్తమం అని అధికారులు సూచించారు. పరీక్షల కోసం 29 వేల 992 మంది ఇన్విజిలెటర్లు, 72 మంది ప్లయింగ్స్కాడ్, 124 సిట్టింగ్ స్కాడ్లకు విధులు కేటాయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa