|
|
by Suryaa Desk | Thu, Apr 09, 2026, 02:12 PM
కేరళలో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదని, కనీసం ఖాతా కూడా తెరవదని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ అన్నారు. గురువారం కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, భారీ పోలింగ్ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి విజయానికి సంకేతమని తెలిపారు. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటముల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని, సీఎం పినరయ్ విజయన్ పాలనలో పేదలకు ఇళ్లు కూడా నిర్మించలేకపోయారని విమర్శించారు.
Latest News