|
|
by Suryaa Desk | Fri, Mar 20, 2026, 02:11 PM
కేంద్ర సహాయ మంత్రి జయంత్ చౌదరికి గుర్తు తెలియని వ్యక్తి నుంచి చంపేస్తామని బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ ఘటనపై మంత్రి జయంత్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మార్చి 19వ తేదీన ఆ కాల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. తుగ్లక్ రోడ్డు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు కాగా, పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారు అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. త్వరలోనే నిందితుడిని గుర్తించనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Latest News