|
|
by Suryaa Desk | Thu, Mar 12, 2026, 06:26 PM
తిరుమలలో అరుదుగా కనిపించే నాగుపాము ప్రత్యక్షమైంది. పచ్చ రంగులో ఉండే ఈ నాగుపామును అందరూ ఆశ్చర్యపోయారు. కొండపై ఆదిశేషు అతిథి గృహం దగ్గర ఓ చెట్టులో దాదాపు మూడున్నర అడుగుల పొడవు గల ఈ నాగుపాము కనింపించింది. అక్కడి సిబ్బంది గమనించి వెంటనే టీటీడీ స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకు సమాచారం ఇచ్చారు. ఆయన వెంటనే అక్కడికి చేరుకుని నాగుపామును జాగ్రత్తగా పట్టుకొని.. అక్కడి నుంచి తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలేశారు.
ఈ పచ్చ నాగపాములు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి.. ఇవి ఆకుపచ్చ, లేత పసుపు రంగులో కనిపిస్తుంటాయి. ఈ నాగుపాములు ఎక్కువగా చెట్లు, పొదల్లో కనిపిస్తుంటాయి. ఈ పాములు కీటకాలు, చిన్న సాలె పురుగుల్ని తిని జీవిస్తుంటాయి. ఈ పాములు మృదువుగా, సన్నగా ఉంటాయని చెబుతున్నారు. ఈ పచ్చగా ఉండటం వల్ల చెట్లపై ఉన్నప్పుడు.. ఆకులలో దాక్కుని ఉన్నప్పుడు గుర్తించడం చాలా కష్టమని చెబుతున్నారు. ఈ నాగుపాములు ఎక్కువగా తేమ ఉండే అడవులు, తోటలు, పొలాలు, చెట్లపై ఉంటాయని.. విషపూరితమైనదనట. తిరుమలలో కనిపించడంతో అందరూ ఆశ్చర్యంగా చూశారు. కొంతమంది వీడియోలు తీయడంతో వైరల్ అయ్యింది.
Latest News