|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 06:54 PM
బుధవారం రేపల్లె డివిజన్ పరిధిలోని ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్ ను రేపల్లె నియోజకవర్గం తెదేపా ఇన్చార్జి అనగాని శివప్రసాద్ రైతులతో కలిసి సందర్శించారు. ఆక్వా రైతులకు ల్యాబ్ ద్వారా అందిస్తున్న సేవల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. నిజంపట్నం మత్స్య శాఖ సహాయ సంచాలకులు భూక్యా సైదా నాయక్ తో కలిసి ల్యాబ్ లో జరుగుతున్న నీటి పరీక్షలు, లవణీయత, కఠినత్వము, అమ్మోనియా, ఐరన్, నైట్రేట్, నైట్రైట్ వంటి వివిధ పరీక్షలను పరిశీలించారు. ఆక్వా రైతులు ల్యాబ్ ను సద్వినియోగం చేసుకొని అధిక దిగుబడులు పొందాలని ఆయన సూచించారు.
Latest News