|
|
by Suryaa Desk | Tue, Mar 10, 2026, 02:50 PM
AP: కర్నూలు టీడీపీ ఎంపీ బస్తిపాటి నాగరాజు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మంగళవారం ఆయన చిన్నాన్న కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు ఉండవెల్లి సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. బైకును తప్పించబోయి కారు చెట్టును ఢీకొట్టడంతో ఎంపీ చిన్నమ్మ మణెమ్మ గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. ఈ విషయం తెలియగానే ఎంపీ ఢిల్లీ నుంచి కర్నూలుకు బయలుదేరారు. జమ్ములమ్మ ఆలయానికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
Latest News