|
|
by Suryaa Desk | Tue, Mar 10, 2026, 02:49 PM
బహ్రెయిన్లో చిక్కుకున్న సుమారు 600 మంది తెలుగు ప్రజలను స్వదేశానికి తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. ఈరోజు నుంచి రోజూ ఒక విమానంలో వారిని భారత్కు తీసుకురావడానికి గల్ఫ్ ఎయిర్ సంస్థతో ఏపీ భవన్ అధికారులు ఏర్పాట్లు చేశారు. డీజీసీఏ, పౌరవిమానయాన శాఖ అధికారులతో చర్చల అనంతరం గల్ఫ్ ఎయిర్ సేవలు ప్రారంభించింది. ఈరోజు 58 మందిని కొచ్చి విమానాశ్రయానికి తీసుకురానున్నారు.
Latest News