|
|
by Suryaa Desk | Sat, Mar 07, 2026, 08:22 PM
హర్యానాలోని ఒక హోలీ రంగుల తయారీ కర్మాగారంలో తాజాగా అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మహిళా కార్మికులు మరణించగా 20 మంది గాయాలపాలయ్యారు. జింద్ జిల్లాలోని సఫిడాన్ నగరంలోగల భట్ కాలనీలో ఈ ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా చెలరేగిన మంటలు నిమిషాల వ్యవధిలోనే కర్మాగారం అంతా వ్యాపించాయి. దట్టమైన పొగ కమ్మేసింది. అసలేం జరిగిందో అర్థం కాక కార్మికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
Latest News