|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 11:58 AM
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో బాంబు దాడులు జరుగుతున్నాయి. అమెరికా సైనిక స్థావరాలు, విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేస్తుండటంతో దుబాయ్, కువైట్, ఖతార్, బహ్రెయిన్, ఇరాక్ వంటి దేశాల్లోని వలస జీవులు భయాందోళనలకు గురవుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది వలస కార్మికులు తమ కుటుంబాల క్షేమం కోసం ఆందోళన చెందుతున్నారు. టీవీలు, సోషల్ మీడియాలో వార్తలు చూస్తూ, తమ వారిని ఫోన్లలో సంప్రదిస్తూ సమాచారం తెలుసుకుంటున్నారు. భారత ప్రభుత్వం జోక్యం చేసుకుని భారతీయులను సురక్షితంగా స్వదేశం రప్పించాలని కోరుతున్నారు.
Latest News