|
|
by Suryaa Desk | Tue, Feb 24, 2026, 02:48 PM
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన పెట్టుబడి విధానంలో కీలక మార్పులు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం నెలవారీగా ఈటీఎఫ్లలో పెట్టుబడి పెడుతుండగా, ఇకపై ఏడాదికి ఒకసారి మాత్రమే పెట్టుబడి పెట్టనుంది. ఐదు వేర్వేరు పథకాల నుంచి నిధులను ఒకే పూల్లోకి తెచ్చి, వార్షికంగా పెట్టుబడి పెట్టేందుకు యోచిస్తోంది. ఈ ప్రతిపాదనను ఇన్వెస్ట్మెంట్ కమిటీ ఆమోదించింది. మార్చి 2న జరిగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో దీనిపై చర్చించి, ఆమోదం తెలపనున్నారు. ఈ మార్పుల వల్ల పెట్టుబడుల నిర్వహణ సులభతరం అవుతుందని EPFO తెలిపింది.
Latest News