|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 09:10 PM
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న లియర్జెట్ 45 వీఎస్ఆర్ సంస్థకు చెందిన చార్టర్డ్ విమానం. ముంబయి నుంచి బారామతికి వెళ్తుండగా విమానాశ్రయానికి 100 మీటర్ల దూరంలోనే ల్యాండింగ్కు ఈ విమానం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో అజిత్ పవార్ సహా మరో ఐదుగురు దుర్మరణం చెందారు. అత్యంత వేగంగా ప్రయాణించే లగ్జరీ బిజినెస్ జెట్గా పిలుస్తారు. అయితే, వీఎస్ఆర్ ఏవియేషన్ కంపెనీ విమానం ముంబయి విమానాశ్రయంలో 2023 సెప్టెంబర్లో కూలిన ఘటన తర్వాత.. ఇటీవలి కాలంలో జరిగిన రెండో పెద్ద ప్రమాదం ఇది. విమాన ప్రమాదంపై విచారణకు డిమాండ్లు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఆ సంస్థ యజమాని వీకే సింగ్ స్పందించారు.
అజిత్ పవార్ ప్రయాణించి ఆ విమానంలో ఎలాంటి నిర్వహణ లోపం లేదని, దాని పరిస్థితిలో అస్సలు ఎటువంటి సమస్య లేదని’ ఆయన నొక్కి చెప్పారు. విమానంలో సాంకేతిక సమస్య ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. ఈ సంస్థ మొత్తం ఏడు లియర్జెట్లను నడుపుతోంది. ఈ నేపథ్యంలో ఒకవేళ సర్వీసులను నిలిపివేసే ఉద్దేశం ఉందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు సింగ్ లేదు అని అసహనం వ్యక్తం చేశారు.
‘‘ఆ విమానంలో ఎలాంటి సమస్య లేదు.. అయినా నేను ఎందుకు సర్వీసులు నిలిపివేయాలి.. మా విమానాలన్నీ ఫిట్గా ఉన్నాయి.. అలాంటప్పుడు వాటిని ఎందుకు నేను పక్కనపడేయాలి.’’ అని ఆయన ఎదురు ప్రశ్నించారు. అంతేకాదు, లియర్జెట్ 45 ప్రపంచవ్యాప్తంగా అత్యంత నమ్మకం కలిగిన విమానాలుగా పరిగణిస్తున్నారని, సింగ్ హైలైట్ చేశారు. ‘కాబట్టి, వాటిని ఎందుకు నిలిపివేయాలి?’ అని అన్నారు.
కాగా, లియర్జెట్ను అమెరికాకు చెందిన బిల్ లియర్ స్విస్ యుద్ధ విమానం ఆధారంగా రూపొందించారు. ఎనిమిది మంది వరకు ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది. ఈ బ్రాండ్ను 1990లో కెనడాకు చెందిన బొంబార్డియర్ సంస్థ కొనుగోలు చేసింది. ఒకప్పుడు సూపర్ రిచ్ కంపెనీ లగ్జరీ జెట్ ప్రయాణానికి సంక్షిప్త రూపం ఇచ్చిన లియర్జెట్ ఉత్పత్తి 2021లో బొంబార్డియర్ గ్లోబల్, ఛాలెంజర్ సిరీస్పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకోవడంతో ముగిసింది.
ఇక, అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం రన్వే సమీపంలో ల్యాండింగ్కు ప్రయత్నిస్తున్న సమయంలో కుప్పకూలి మంటల్లో కాలిబూడిదయ్యింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్, ఆయన వ్యక్తిగత భద్రత అదికారి విదిప్ జాధవ్, ఇద్దరు పైలట్లు సుమిత్ కపూర్, శాంభవి పాఠక్లు ప్రాణాలు కోల్పోయారు. సుమిత్ కెప్టెన్గా వ్యవహరిస్తుండగా.. శాంభవి ఫస్ట్ ఆఫీసర్. కెప్టెన్ సుమిత్కు విమానం నడపటంలో 16 వేల గంటల అనుభవం ఉందని, కో-పైలట్ పాఠక్కు 1500 గంటల అనుభవం ఉందన్నారు. ఇటువంటి విమానాలను నడపడంలో కపూర్కు అపారమైన అనుభవం ఉందని చెప్పారు.
Latest News