|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 03:00 PM
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ను అవినీతి కేసులో జైలుకు పంపిన ప్రభుత్వం.. ఆయన సోదరీమణులపై కూడా యాంటీ టెర్రరిస్ట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసింది. ఇమ్రాన్ ను కలుసుకోవడానికి అధికారులు నిరాకరించడంతో ఆయన సోదరీమణులు అడియాలా జైలు ముందు ఆందోళన చేయగా పోలీసులు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారితో పాటు పీటీఐ సీనియర్ నేతలు, పార్టీ కార్యకర్తలు మొత్తం 50 మందిపై కేసు నమోదు చేసినట్లు రావల్పిండి పోలీసులు తెలిపారు. దీంతో పాటు ఎఫ్ఐఆర్ లో పాకిస్థాన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ 120బి (నేరపూరిత కుట్ర) ఆరోపణలు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
Latest News