|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 03:05 PM
ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునఃనిర్మాణం చేసే పనిలో ఉన్నామని చెప్పారు. ఏలూరు జిల్లా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు.. గోపీనాథపట్నంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. అనంతరం నల్లమాడులో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామసభలు అంటే మొక్కుబడిగా నిర్వహించడం కాదని, ఒక మార్పు రావాలని అన్నారు.
Latest News