కనిగిరి మండలంలో వినూత్న సంప్రదాయం, ప్రతి మూడేళ్లకు ఒకసారి తమ భార్యలతో మళ్ళీ పెళ్లి
 

by Suryaa Desk | Sat, Nov 29, 2025, 04:53 PM

ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని కొత్తపాలెం గ్రామంలో ఓ వినూత్న సంప్రదాయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ దామిరెడ్డి వంశస్థులు ప్రతి మూడేళ్లకు ఒకసారి తమ భార్యలను మళ్లీ పెళ్లి చేసుకుంటారు. ఈ ఏడాది జరిగిన వేడుకలో ఏకంగా 40 జంటలు వేదమంత్రాల సాక్షిగా మరోసారి ఒక్కటయ్యాయి.గ్రామంలోని నాగార్పమ్మ అమ్మవారి ఆలయంలో జరిగే కొలుపుల సందర్భంగా ఈ ఆచారాన్ని పాటిస్తారు. పూర్వీకుల నుంచి వస్తున్న ఈ సంప్రదాయంలో భాగంగా, కొలుపుల రెండో రోజు 'పట్నం కొలుపులు' నిర్వహిస్తారు. ఈ సమయంలోనే భార్యాభర్తలు సంప్రదాయబద్ధంగా మళ్లీ వివాహ బంధంతో ఒక్కటవుతారు.నేటి ఆధునిక కాలంలో వివాహ బంధాలు బలహీనపడుతున్నాయని, చిన్నచిన్న కారణాలకే దంపతులు విడిపోతున్నారని ఆవేదన వ్యక్తమవుతున్న తరుణంలో, కొత్తపాలెం గ్రామస్థులు పాటిస్తున్న ఈ ఆచారం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇదేదో మొక్కుబడిగా కాకుండా, శాస్త్రోక్తంగా పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఈ వివాహ వేడుకను ఘనంగా జరుపుకోవడం విశేషం. 

Latest News
India tackling e-waste with organised recycling, recovery of rare materials Fri, Dec 05, 2025, 06:04 PM
Foxconn's China exit due to erratic policies, signals MNCs shift to India, Vietnam Fri, Dec 05, 2025, 05:48 PM
2nd Test: 'He justified his selection,' says Vaughan after Jacks takes a one-handed blinder to dismiss Smith Fri, Dec 05, 2025, 05:46 PM
Centre orders high-level inquiry into IndiGo fiasco, total normalcy expected in 3 days Fri, Dec 05, 2025, 05:39 PM
510 out of 3,986 roads under PMGSY found to be of poor quality: Centre Fri, Dec 05, 2025, 05:34 PM